చండీగఢ్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య ఆట మొదలైందంటూ బీజేపీ విమర్శించింది. పంజాబ్లో మొత్తం 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 65 మంది సిద్ధూకు మద్దతుగా ఉన్నారు. అయితే అమృత్సర్లోని తన నివాసంలో సిద్ధూ బుధవారం నిర్వహించిన అల్పాహార సమావేశానికి 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బలం 62, సీఎం అమరీందర్ సింగ్ బలం 15 అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఎద్దేవా చేశారు. అధికార కాంగ్రెస్లో అధికారం కోసం పోరు తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. సీఎం అమరీందర్, సిద్ధూ మధ్య ఆట మొదలైందని ఆయన విమర్శించారు. వీరిద్దరి మధ్య అధికార పోరు ఆటను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు బుధవారం ట్వీట్ చేశారు.