National
- Dec 19, 2020 , 16:48:55
కాంగ్రెస్ పార్టీకి రుచి గుప్తా రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి ఇంచార్జ్ రుచి గుప్తా రాజీనామా చేశారు. సంస్థాగత మార్పులకు జాప్యం కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ దీనికి కారణమని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నియమించిన రుచి గుప్తా ఈ మేరకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. పార్టీ నాయకత్వం లోటును రాహుల్ గాంధీ మాత్రమే భర్తీ చేయగలని పేర్కొన్నారు. కాగా పార్టీ నాయకత్వంపై సీనియర్ నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తిపై సోనియా గాంధీ శనివారం కీలక సమావేశం నిర్వహించిన రోజునే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రుచి గుప్తా వెల్లడించారు.
తాజావార్తలు
- అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి
- అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్రౌండర్కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
MOST READ
TRENDING