వ్యాపారులకు తలలో నాలుకలా ఉంటా..
టీఆర్ఎస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించండి
రాష్ట్ర రవాణాశాఖ పువ్వాడ అజయ్కుమార్
టీఆర్ఎస్కు అండగా ఉంటాం: వ్యాపారవేత్తలు
ఖమ్మం, ఏప్రిల్ 23: గాంధీచౌక్లోని వ్యాపారులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉన్నానని, భవిష్యత్తులో కూడా వారి తలలో నాలుకలా ఉంటానని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని 36వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన సోదర సమానుడైన టీఆర్ఎస్ అభ్యర్థి పసుమర్తి రామ్మోహన్రావు గత కేఎంసీ ఎన్నికల్లో 14 ఓట్లతో ఓడిపోయాడని అన్నారు. ఈ దఫా ఎన్నికల్లో 1400 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాంధీచౌక్ సెంటర్ మహత్ముడి విగ్రహం గతంలో ఏ స్థితిలో ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో చూడాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.50 లక్షలతో గాంధీచౌక్ సెంటర్ ఆధునీకరించామన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో త్రీటౌన్ రూపురేఖలు మార్చామని వివరించారు. రానున్న రోజుల్లో మున్నేరుకు ఇరువైపులా కరకట్టను నిర్మిస్తామని, దానిపై వాకింగ్ ట్రాక్లు, పార్కుల ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకుల కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయని విమర్శించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్లో కేటాయించిన రూ.150 కోట్లతో ప్రతి గల్లీలోనూ అంతర్గత రోడ్లు నిర్మించామన్నారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, మాజీ అధ్యక్షులు కొప్పు నరేశ్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని, 36వ డివిజన్ అభ్యర్థి పసుమర్తి రామ్మోహన్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. మాజీ కౌన్సిలర్ పెనుగొండ ఉపేందర్ మాట్లాడుతూ స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాను మంత్రి సూచనతో దానిని ఉపసంహరించుకొని పసుమర్తికి మద్దతు తెలుపుతున్నానని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి పసుమర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గుత్తా వెంకటేశ్వరరావు, నగేశ్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బీజేపీ మోసపూరిత రాజకీయాలను తిప్పికొట్టండి
కరోనా ఎఫెక్ట్: సిబ్బందికి జర్మన్ ఎంబసీ కీలక సూచనలు