హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు.. కేంద్ర విత్తన ధ్రువీకరణ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేండ్లు బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. విత్తనాభివృద్ధిలో చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం ఈ అవకాశం కల్పించింది. కేంద్ర విత్తన ధ్రువీకరణ బోర్డు సభ్యుడిగా ఎంపికవడంపై కేశవులు హర్షం వ్యక్తంచేశారు. విత్తనాభివృద్ధిలో రాష్ర్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.