తిరువనంతపురం: కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నెల 11 నుంచి కొత్త నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయనున్నది. రెండు వారాల్లోపు ఒక డోసు టీకా తీసుకున్న ధ్రువీకరణ పత్రం లేదా 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారినే ఇకపై షాపులు, మాల్స్, బ్యాంకులు, మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, వివిధ కార్యాలయాల్లో ప్రవేశానికి అనుమతిస్తారు. వర్కర్స్తోపాటు సందర్శకులకు ఇది అమలవుతుందని ఆ రాష్ట్ర విపత్తు నియంత్రణ నిర్వాహణ అథారిటీ ఆదివారం తెలిపింది. దీనిని పక్కగా పాటించేందుకు సిబ్బందిని అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని చెప్పింది. కాగా, కేరళలోని వాణిజ్య సంఘాలు, ప్రతిపక్షాలు ఈ కొత్త నిబంధనను వ్యతిరేకించగా ప్రభుత్వం మాత్రం సమర్థించుకున్నది.