కరోనా పోరులో కీలకంగావైద్యులు, సిబ్బంది
కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణులకు డెలివరీలు
తల్లీబిడ్డల ప్రాణాలను రక్షిస్తూ..
అభినందించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే విఠల్రెడ్డి
భైంసా, ఏప్రిల్, 22 : కరోనా .. కరోనా.. ఎవరి నోట విన్నా ప్రస్తుతం ఈ వైరస్ జపమే వినిపిస్తున్నది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం సైతం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో జనం ఇండ్లల్లోంచి బయటకు రావడానికి జం కుతున్నారు. వైరస్ ప్రమాదకరమని తెలిసినా దవాఖానకు వస్తున్న వారికి చికిత్స అందజేస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది అజరామర సేవలు అందిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో అ భినందనలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి వారి సేవలను కొనియాడారు.
పేదలకు అండగా..
పేదలకు అండగా ఉంటూ కనిపించే దైవాలుగా వైద్య సిబ్బంది నిలుస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణులు, ఆందోళన చెందుతున్న జనాలకు మేమున్నామంటున్నారు. భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 24 గంటల పాటు కరోనా కట్టడికి డాక్టర్లు అలుపెరుగని సేవలు అందిస్తున్నారు. ఈ రోజుల్లో కరోనా సోకిందంటే చాలు.. ప్రైవేట్ వైద్యశాల ల్లో లక్షలు కుమ్మరియ్యాల్సి వస్తున్నది. అలాం టిది భైంసా ఏరియా దవాఖానలో కరోనా సో కిన గర్భిణులకు ప్రైవేట్ వైద్యం అవసరం లే కుండానే దగ్గరుండి ప్రసవాలు చేస్తూ వారికి భ రోసానిస్తున్నారు. పూర్తి నార్మల్ డెలివరీ చేస్తూ అటు తల్లి, ఇటు బిడ్డను రక్షిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి సైతం రాక..
ముథోల్ నియోజకవర్గంలో భైంసా ఏరియా దవాఖానకు చుట్టు పక్కల ఏడు మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో వస్తుంటారు. అందులో కొవిడ్ సోకిన గర్భిణులు కొందరు ఏరియా దవాఖానకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా ఎనిమిది మంది రాగా.. అందులో కరోనా సోకిన గర్భిణులకు సైతం వైద్యం చేయడానికి ముందుకొచ్చిన వైద్యులు వనజ, పద్మావతి, వనిత విశేష సేవలందిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 22 వరకు వరకు కరోనా పాజిటివ్ ఉన్న ఎనిమిది మందికి ప్రసవాలు చేశారు. అందులో ఏడుగురికి నార్మల్, ఒకరికి సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. దీంతో వీరిని కుటుంబ సభ్యులతో పాటు ముథోల్ నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
82% చిన్న వ్యాపారాలు గల్లంతే.. ఇదీ కొవిడ్-19 ఎఫెక్ట్
నిర్లక్ష్యమా ! బరితెగింపా !!