భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : వీహెచ్పీ, బజరంగ్దళ్ల ఆధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం చేశా రు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహ కార్యదర్శి గనపురం రాజే శ్వర్రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి సంవత్స రం హనుమాన్ విజయయాత్ర సందర్భంగా నిర్వహించే బైక్ర్యాలీని ప్రస్తుతం నిర్వహించడం లేదన్నారు. వీహెచ్ పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటూ సమాజా నికి ఏ సమయంలోనైనా సేవ చేసేందుకు సిద్ధంగా ఉండా లన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ ఉమ్మడి జిల్లా సహ కా ర్యదర్శి భానుప్రసాద్, జిల్లా కార్యదర్శి మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు రవీందర్, మండల అధ్యక్షుడు శ్రీశైలం యాద వ్, బజరంగ్దళ్ జిల్లా సహ సంయోజక్ భాను, జిల్లా స త్సంగ్ ప్రముఖ్ శ్రీనివాస్, మండల సత్సంగ్ అంజయ్య, మండల కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి
హనుమాన్ను నిత్యం ఆరాధిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలోని పాటిమీ ది ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వ హించిన హనుమాన్ జయంతి వేడుకలో సింగిల్విండో చై ర్మన్ చింతల దామోదర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యం లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వే డుక నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, సీతారామచంద్ర స్వామి దేవాల య కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తూ పూజలు
హనుమాన్ జయంతి సంద ర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు కరోనా నిబంధనలు పాటి స్తూ పూజలు చేశారు. కార్యక్రమంలో మురళీధర్రెడ్డి, మ ల్లారెడ్డి, భిక్షపతి, సత్యనారాయణ, కాశీనాథ్, కుమార స్వామి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు
నారాయణపురం మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను భక్తు లు మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేం ద్రంలోని గుడి గుట్ట దేవాలయంలోని హనుమన్ ఉత్సవ విగ్రహానికి శంకర్ స్వామి ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండ శ్రీకాం త్, సురపల్లి శివాజీ, బోడ్డుపల్లి రమేశ్, ప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు