తిరువనంతపురం: దేశమంతటా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుంటే కేరళలో మాత్రం అంతకంతకే పెరుగుతున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 25 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు కేరళ నుంచే ఉంటున్నాయి. ఇవాళ కూడా కేరళలో కొత్తగా 26,701 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 39,37,996కు పెరిగింది.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇవాళ కూడా 74 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,496కు పెరిగింది. ప్రస్తుతం కరోనా మరణాలు, రికవరీలు పోను 2,47,791 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 17.17 శాతంగా ఉన్నది.