తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజు వారీ వైరస్ కేసులు మళ్లీ 20 వేలు దాటాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,182 పాజిటివ్ కేసులు, 178 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,46,228కు, మొత్తం మరణాల సంఖ్య 23,165కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 26,563 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 42,36,309కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,190 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.