తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా వారం రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,040 కరోనా కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,93,603కు, మొత్తం మరణాల సంఖ్య 17,328కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 20,046 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 32,97,834కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,77,924 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.