తిరువనంతపురం: కేరళలో కరోనా ( Corona in Kerala ) విస్తృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, పాజిటివ్ కేసుల కంటే ఇవాళ రికవరీల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మొత్తం 26,711 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేరళలో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 43,10,674కు చేరింది. ఇక కరోనా మరణాలు కూడా రోజూ భారీగానే నమోదవుతున్నాయి.
ఇవాళ కూడా 152 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 23,591కి పెరిగింది. ఇక ఇవాళ మొత్తం 1,13,295 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే కేరళలో ఇవాళ కరోనా పాజిటివిటీ రేటు 17.34 శాతంగా ఉన్నది.