తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ప్రభావం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు అటుఇటుగా మాత్రమే కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ కేసుల సంఖ్య బాగానే తగ్గింది. గడిచిన 24 గంటల్లో 15,951 మందికి పాజిటివ్ వచ్చింది. అదే సమయంలో ఇవాళ్టి రికవరీల సంఖ్య కొంచెం ఎక్కువగానే నమోదైంది. ఇవాళ 17,658 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 44,41,430కి పెరిగింది.
ఇక, కరోనా మరణాలు మాత్రం ఏ రోజు కూడా 100కు తగ్గకుండా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా 165 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,603కు పెరిగింది. కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం 1,63,280 యాక్టివ్ కేసులు ఉన్నాయి.