తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజూ 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా అక్కడ 12,220 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటున్నప్పటికీ.. యాక్టివ్ కేసుల తరుగుదలలో వేగం మందగించింది. ఇవాళ కొత్తగా 12,502 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
ఇక కేరళలో కరోనా మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 97 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,586కు చేరింది. ప్రస్తుతం కేరళలో ఇంకా 1,14,844 యాక్టివ్ కేసులు ఉన్నాయి.