తిరువనంతపురం: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,095 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,49,128కు, మొత్తం మరణాల సంఖ్య 13,505కు పెరిగింది. కాగా గత 24 గంటల్లో 10,243 కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 28,31,394కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,03,764 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.