తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా తీవ్రత కొనసాగుతున్నది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలకు పెరిగింది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 10,905 కరోనా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,88,894కు, మొత్తం మరణాల సంఖ్య 12,879కు పెరిగింది. కేరళలో గత 24 గంటల్లో 12,351 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 27,75,967కు చేరిందని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 99,591 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.