తిరువనంతపురం: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దుశ్చర్యలను ఖండిస్తూ కేరళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ( MK Muneer ) ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే ఆ కామెంట్ను తక్షణమే డిలీట్ చేయాలని ఆ ఎమ్మెల్యేకు వార్నింగ్ లేఖ వచ్చింది. ఒకవేళ ఆ పోస్టును డిలీట్ చేయకుంటే.. జోసొఫ్ సర్ మాదిరిగానే శిక్ష ఉంటుందని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కేరళలో పీఎఫ్ఐ కార్యకర్తలు.. జోసొఫ్ అనే టీచర్ చేతిని నరికేశారు. అయితే తాలిబన్లపై చేసిన కామెంట్కు తాను కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే మునీర్ తెలిపారు. తాలిబన్లను విమర్శిస్తూ ఆగస్టు 17వ తేదీన ఫేస్బుక్లో ఎమ్మెల్యే పోస్టు పెట్టారు. మానవహక్కులను తాలిబన్లు గౌరవించడం లేదని ఆ పోస్టులో ఆయన ఆరోపించారు. బెదిరింపు లేఖకు సంబంధించి ఎమ్మెల్యే మునీర్ ఫిర్యాదు చేశారు. సీఎం, డీజేపీలకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు చెందిన ఎమ్మెల్యే మునీర్ పోస్టుపై ఆన్లైన్లో ట్రోలింగ్ కూడా నడుస్తోంది.