తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి ఒకరు షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సీటును ఎస్టీలకు కేటాయించారు. కాగా, పానియా తెగకు చెందిన 31 ఏండ్ల మణికుట్టన్ఈ ప్రాంతంలో ఎంబీఏ చదివిన తొలి వ్యక్తి. ఈ నేపథ్యంలో బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్ పేరు కూడా ఉన్నది. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు.
‘బీజేపీ అభ్యర్థిగా నా పేరును టీవీలో ప్రకటించడం చూసి ఆశ్చర్యపోయాను. కొంత భయపడ్డాను. పానియా వర్గానికి చెందిన వారిని ఎన్నికల్లో నిలబెట్టడానికి బీజేపీ నన్ను ఎంచుకున్నందుకు నిజంగా సంతోషించాను. అయితే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఫోన్ ద్వారా వారికి చెప్పాను’ అని మణికుట్టన్ తెలిపారు. ‘నేను నిజానికి సామాన్య వ్యక్తిని. ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. ఉద్యోగం, కుటుంబమే నాకు ముఖ్యం. అందుకే బీజేపీ ఆఫర్ను సంతోషంగా నిరాకరిస్తున్నాను’ అని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.