తిరువనంతపురం : కరోనా కట్టడికి కేరళలో విధించిన లాక్డౌన్ ను ఈనెల 30 వరకూ పొడిగిస్తున్నట్టు సీఎం పినరయి విజయన్ శుక్రవారం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 30,000 పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరోవైపు తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిసూర్ జిల్లాల్లో పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో నియంత్రణలను సడలించారు. మలప్పురం జిల్లాలో లాక్డౌన్ నియంత్రణలు కొనసాగుతాయని సీఎం విజయన్ పేర్కొన్నారు. ఇక కేరళలో మహమ్మారి బారినపడి తాజాగా 124 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 23.18 శాతంగా నమోదైంది.