జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంటలు కోతకు రావడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తూ కూలీల హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి..
మాచారెడ్డి, మే 3 : ఉపాధి కూలీలు పనులు చేసేసమయంలో తప్పకుండా కొవిడ్ నిబంధలను పాటించాలని ఎంపీడీవో బాలకృష్ణ సూచించారు. మండలంలోని కొత్తపల్లి, లచ్చాపేట గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని, నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి, మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఎంపీడీవో వెంట ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఉపాధి పనుల పరిశీలన
నాగిరెడ్డిపేట్, మే 3: మండలంలోని జాన్కంపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను సోమవారం ఎంపీడీవో రఘు పరిశీలించారు. కూలీల వివరాలను ఈసీ మధును అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరుశాతం పెంచాలని ఈసీకి సూచించారు. ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు ఉన్నారు.
కొలతల ప్రకారం కూలి అందజేయాలి..
పిట్లం, మే 3: మండలంలోని కొనసాగుతున్న ఉపాధి హామీ పనులుచేస్తున్న కూలీలకు కొలతల ప్రకారం కూలి అందజేయాలని ఎంపీడీవో వెంకటేశ్వర్ అన్నారు. ఆయన సోమవారం హస్నాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పనుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ గోపాల్రెడ్డి, ఏపీవో శివకుమార్, పంచాయతీ కార్యదర్శి శేఖర్గౌడ్ ఉన్నారు.
ఉపాధి హామీ పనులు ప్రారంభం
సదాశివనగర్, మే 3: మండలంలోని అమర్లబండ, కల్వరాల్ గ్రామాల్లో సోమవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ కొత్తూరి లత రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నిట్టు కిషన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి కుటుంబానికి జాబ్కార్డులను అందిస్తామన్నారు. జాబ్కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులకు రావాలన్నారు. గ్రామ చెరువులో పూడిక మట్టి తీసి వ్యవసాయ భూములకు తరలిస్తున్నట్లు తెలిపారు. అమర్లబండలో అంబీర్ చక్రధర్ రావు, కల్వరాల్లో కారోబార్ కోట భూమన్న, గండ్ల ఆంజనేయులు, గుర్రపు రాజు, హరినారాయణ, కుంట పెద్ద రాజు, యాదగిరి, కుమ్మరి బాలయ్య, గడ్డం రవి, రాకేశ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.