తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయి పెను సవాల్ ఎదురవుతోందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కొవిడ్-19తో రాబడులు కుదేలై ఆర్థిక లోటు ఎగబాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో పినరాయి విజయన్ సర్కార్ విధానాలపై గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ కోసం అదనంగా రూ 1000 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు.
ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్నా వ్యాక్సిన్ల కోసం కేరళ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచిందని, దేశీ తయారీదారుల నుంచి వ్యాక్సిన్లను సేకరిస్తోందని చెప్పారు. సంక్షేమ ఫించన్లు అందని దారిద్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు పరిహారం కింద రూ 1000 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యాక్సిన్ ఛాలెంజ్ కు సానుకూల స్పందన లభించిందని గవర్నర్ పేర్కొన్నారు.