విద్యానగర్/బీర్కూర్ , మే 12: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. బుధవారం విద్యానగర్లో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి స్వయంగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పలు కాలనీల్లో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ ద్వారా స్ప్రే చేయించారు. పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ను చల్లారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాసు, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎర్రోళ్ల సాయిరాం ఆధ్వర్యంలో వాడవాడలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా రసాయనాన్ని పిచికారీ చేశామన్నారు.