తిరువనంతపురం: దేశంలో గత కొన్ని నెలలుగా విజృంభించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దాంతో కేరళ ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ తరగుతులను మొదలుపెట్టాలని డిసైడ్ చేసింది. కేరళ పాఠశాల విద్యాశాఖ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.