తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆ రాష్ట్ర 15వ అసెంబ్లీలో సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ పీటీఏ రహీమ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. పినరయి విజయన్తోపాటు మొత్తం 139 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. వారిలో 53 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఉన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి మళ్లీ విజయం సాధించింది. దాంతో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.