దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ సౌకర్యం లేదు
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
స్వయంగా భూమిని రిజిస్ట్రేషన్చేయించుకున్న మంత్రి
వేల్పూర్, జూన్ 3 : ధరణి పోర్టల్ రైతులకు వరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తన వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయానికి మంత్రికి గురువారం వచ్చారు. 15 నిమిషాల్లోనే మ్యుటేషన్ పూర్తి చేసి ఈ-పాస్బుక్ అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రైతులందరికీ ఇలాంటి సేవలే అందించాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని సాహెబ్పేట్ గ్రామశివారులో కొనుగోలు చేసిన 2-39 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తహసీల్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో రైతులు భూముల కొనుగోలు, విక్రయాలు చేసిన అనంతరం పేర్ల మార్పిడికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుండేదని అన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా సులువుగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. తహసీల్దార్ సతీశ్ రెడ్డి మంత్రికి ఈ-పాస్బుక్ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.