పినరయి : కేరళ సీఎం పినరయి విజయన్ ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పినరయి ఆర్సీ అమలా స్కూల్లో ఆయన ఓటేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ప్రజలు ఎల్డీఎఫ్కు చరిత్రాత్మక విజయాన్ని అందిస్తారన్నారు. ఓటేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన సతీమణి కమల కూడా ఓటేశారు. ఈ ఎన్నికలు ప్రజా బలానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిచేందుకు ప్రయత్నించారని, కానీ గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని ఆయన గుర్తు చేశారు. 2016 నుంచి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలుసన్నారు. ప్రభుత్వంతో ప్రజలు గత అయిదేళ్ల నుంచి కలిసి ఉన్నారన్నారు.