తిరువనంతపురం : కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నా రాష్ట్రంలో అత్యంత వేగంగా విస్తరించే డెల్టా వేరియంట్ ముప్పు ఉన్నందున ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించాలని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. కేరళలో కరోనా కేసులు 42 శాతం తగ్గాయని, అయితే వైరస్ డెల్టా వేరియంట్ ముప్పును ఎదుర్కొంటున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఇక కేరళలో తాజాగా 11,361 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 90 మంది మరణించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేరళలో శనివారం నుంచి దశలవారీగా అన్ లాక్ ప్రక్రియ మొదలైంది. 8 శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ప్రవేశించేందుకు ఎలాంటి పాస్ అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.