తిరువనంతపురం: కేరళలో గత కొన్ని నెలలుగా విజృంభిస్తూ వచ్చిన కరోనా మహమ్మారి ఇవాళ కాస్త శాంతించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ 15 వేలకు పైనే రోజువారి కొత్త కేసులు నమోదు కాగా.. ఇవాళ మాత్రం కేవలం 11,699 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 46,41,614కు పెరిగింది. ఇక ఇవాళ 58 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,661కి చేరింది.
ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య మాత్రం పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగానే ఉన్నది. ఇవాళ మొత్తం 17,763 మంది కరోనా బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 44,59,193కు చేరింది. కరోనా మరణాలు, రికవరీలు పోగా ప్రస్తుతం 1,57,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా 14 జిల్లాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఇవాళ త్రిసూర్లో అత్యధికంగా 1,667 మందికి పాజిటివ్ వచ్చింది.