రామేశ్వరం : తమిళనాడు శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని రామేశ్వరం మత్స్యకారుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక నేవి అదుపులోకి తీసుకున్న తమినాడు, పుదుచ్చేరికి చెందిన మత్స్యకారులను పడవను వెంటనే విడుదల చేయాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మత్స్యకారుల సంఘం సమావేశంలో తీర్మానం చేశారు.
కేంద్ర కల్పించుకొని మత్స్యకారులను విడుదల చేయించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని రామేశ్వరం మత్స్యకారుల సంఘం కార్యదర్శి జేసురాయ్ పేర్కొన్నారు.
234 స్థానాలున్న తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.