ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీకి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనపై నిఘా పెట్టారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఆరోపించారు. తన గురించి ప్రతి సమాచారం వారికి అందుతున్నదని, తాను ఏమి చేస్తున్నానో కూడా వారికి తెలుసని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నదని, ఇది చూసి ఎన్సీపీ, శివసేన భయపడుతున్నాయని నానా పటోల్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీజేపీని అడ్డుకునేందుకే శివసేన, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తమ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో భవిష్యత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని నానా పటోల్ ఇటీవల అన్నారు.