న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫైల్ను గురువారం మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు పంపారు. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సరిదిద్దినట్లు తెలిపారు. అలాగే పథకం అమలుపై హైకోర్టు స్టే ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డోర్స్టెప్ డెలివరీ రేషన్ పథకాన్ని (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన) ఎందుకు నిలిపివేయాలి అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.