న్యూఢిల్లీ: పంజాబ్లో వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఆ రాష్ట్ర ప్రజలపై అప్పుడే హామీల వర్షం మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో ఆమ్ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే.. రాష్ట్రంలో ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆయన ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. రేపు చండీగఢ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న కేజ్రివాల్.. ఒకరోజు ముందుగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
పంజాబ్లో నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో అక్కడి మహిళలు సంతోషంగా లేరని అరవింద్ కేజ్రివాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఢిల్లీలో 200, అంతకంటే తక్కువ యూనిట్ల విద్యుత్ను వినియోగించే వారికి ఉచిత కరెంట్ అందజేస్తున్నామని, దాంతో ఢిల్లీ మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తాము వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పంజాబ్లో కూడా ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
పంజాబ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో నేతలంతా ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు.