న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఆ భయంతోనే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ)-2021’ బిల్లును తీసుకొచ్చి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. దేశంలో ఢిల్లీ పరిపాలన విధానాన్ని గురించి చర్చించుకొంటున్నారని, అందువల్ల బీజేపీలో భయం మొదలైందని అన్నారు.