నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లాలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన వరి ధాన్యం సీఎంఆర్ను వెంటనే సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం రైస్మిల్లర్లతో సీఎంఆర్ బియ్యం, ధాన్యం సేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2018-19, 2019-20కి సంబంధించిన సీఎంఆర్ బియ్యం వివరాలను రైస్మిల్లర్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. రాబోయే సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందున గోదాములను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్వో కిరణ్కుమార్, రైస్మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రైస్మిల్లర్ల సంఘ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేసీని ఘనంగా సన్మానించారు.
అదనపు కలెక్టర్కు సన్మానం..
రెవెన్యూ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సీ రాంబాబును జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయంలో జేసీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉద్యోగులు శ్రీనివాస్రెడ్డి, రమేశ్కుమార్, బాలకృష్ణ, మల్లికార్జున్, శరత్బాబు, నర్సింహారెడ్డి, అంజుకుమార్, శ్రీనివాస్గౌడ్, సత్యనారాయణ, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.