శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 92 ఏండ్లు. వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ పదవి నుంచి గిలానీ జూన్లో వైదొలిగారు. ఆయన మృతి పట్ల జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంతాపం ప్రకటించారు.