న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నాయకులతో ఈ నెల 24న ప్రధాని మోదీ భేటీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించి మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ప్రధాని సమావేశం నిర్వహించనున్నారన్నది ఊహాగానమేనని పేర్కొన్నాయి. ‘రాష్ట్ర హోదా’ గురించి చర్చించే అవకాశమున్నప్పటికీ… దాని పునరుద్ధరణకు పార్లమెంటు అనుమతి అవసరమని తెలిపాయి.
కేంద్ర మంత్రులతో మోదీ భేటీ
కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్లతో ప్రధాని మోదీ ఆదివారం తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. మంత్రుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఇది ఆరో సమావేశం. కేంద్రమంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో మార్పుల కోసమే మోదీ మంత్రులతో సమావేశం జరుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు