న్యూఢిల్లీ : పాలస్తీనా అంశంపై పాలక బీజేపీ మద్దతుదారులను కాషాయ భక్తులుగా పేర్కొటూ కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి సూచించిన పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉంటుందని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి పేర్కొన్న నేపథ్యంలో కార్తీ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.
పాలస్తీనాలో అత్యధికులు ఇస్లాంను అనుసరిస్తున్నందునే ఆ దేశంపై ఇజ్రాయిల్ అణిచివేతను బీజేపీ మద్దతుదారులు సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. కాగా గాజాలో ఆదివారం ఇజ్రాయిల్ దళాలు చేపట్టిన దాడుల్లో 42 మంది పాలస్తీనీయులు మరణించారు. ఇరు దేశాల సరిహద్దుల్లో గత వారం నుంచి పరిస్థితి దిగజారింది.