బెంగళూరు: కర్ణాటక సీఎం యెడియూరప్పను ఆ పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రంలో మరిన్ని సమస్యలు వస్తాయని మఠాధిపతులు హెచ్చరించారు. సీఎం పదవి నుంచి యెడియూరప్ప దిగిపోరన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో పలు మఠాలకు చెందిన అధిపతులు ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సమావేశమయ్యారు. సీఎం యెడియూరప్పను మార్చేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తుండటంపై వారు చర్చించారు.
యెడియూరప్ప స్థానాన్ని మార్చకూడదని బాలేహోసూర్ మఠానికి చెందిన దింగలేశ్వర స్వామి తెలిపారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించినట్లయితే కర్ణాటక మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. యెడియూరప్ప నాయకత్వంలోనే సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని ఆయన సూచించారు.
కాగా సీఎం యెడియూరప్ప మార్పును వ్యతిరేకిపస్తూ కర్ణాటకలోని పలు మఠాలు, పీఠాలకు చెందిన అధిపతులు గత కొన్ని రోజులుగా సమావేశమవుతున్నారు. యెడియూరప్పను కలిసి ఆయనకు తమ మద్దతును తెలియజేశారు.