కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్రాలు పాటించి వైరస్ నుంచి రక్షణ పొందాలని సూచించారు. 45 ఏండ్లు పైబడినవారు వ్యాక్సిన్ వేసుకోవడం, అన్ని వేళలా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి సూత్రాలు తప్పనిసరి అని చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్ను కట్టడిచేయడంలో తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్నగర్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే అవకాశమే లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 2 వేల పైచిలుకు అనాథ శరణాలయాలకు విదేశీ ఆర్థిక సహాయం నిలిచిపోయిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇవీ కూడా చదవండి…
జవాన్ల మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కామారెడ్డి ట్రస్మా అధ్యక్షుడు
కొండపోచమ్మ సాగర్ అద్భుతంగా ఉంది
ప్రభుత్వ పాఠశాలలకు కాగ్నిజెంట్ 500 ట్యాబ్లెట్లు, 50 ల్యాప్టాప్ల విరాళం