బెంగళూరు: దేశంలో మరో కరోనా కేంద్రంగా కర్ణాటక మారుతున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 48,296 కరోనా కేసులు, 217 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,23,142కు, మొత్తం మరణాల సంఖ్య 15,523కు పెరిగింది.
మరోవైపు కర్ణాటకలో గత 24 గంటల్లో 14,884 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,24,909కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 3,82,690 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.