హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్ప్లాంటేషన్లో రికార్డు సృష్టించామని ‘కిమ్స్’ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 12 కొవిడ్ డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్.. మొత్తంగా 50 ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్ప్లాంటేషన్లను విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీ భాస్కర్రావు తెలిపారు. ఇది ఆసియా ఖండంలోనే అరుదైన రికార్డని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని కిమ్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జమ్మూకశ్మీర్, పంజాబ్, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టా ల నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తమ దవాఖానకు వచ్చారని, అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ సపోర్ట్తో వారి ప్రాణాలు కాపాడామని చెప్పారు. కరోనా బారినపడి తీవ్రమైన రెస్పిరేటరీ సమస్యలతో తమ దవాఖానల్లో చేరినవారిలో 12 మందికి ఊపరితిత్తుల మార్పిడి చేయడం ఆసియాలోనే రికార్డని ఆయన పేర్కొన్నారు.