వెంగళరావునర్, ఏప్రిల్ 9: కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ డివిజన్లోని శ్రీనగర్కాలనీ, శాలివాహననగర్లో జీహెచ్ఎంసీ నూతనంగా కేటాయించిన ఐదు స్వచ్ఛ ఆటోలను జెండాఊపి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములు కావావాలని ఆయన ఆకాక్షించారు. కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కృషి చేయాలన్నారు. చెత్తచెదారాన్ని రోడ్ల మీద, కాలువల్లో, వీధి చివరన పడేయొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెత్తకుండీలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కిందపడేసి వెళ్తున్నారని దీంతో కుక్కలు అటూ.. ఇటూ.. లాగడంతో రోడ్డంతా వ్యర్థాలతో నిండిపోయే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. ఇండ్లల్లోని వ్యర్థాలను చెత్తకుండీల్లోగాని, ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోలో వేయలాని విజ్ఞప్తి చేశారు. తద్వారా దోమలు, ఈగలు చెత్తకుప్పలపై వాలకుండా చేసినట్లయితే వ్యాధులు దరిచేరే అస్కారం ఉండదని అన్నారు. స్వచ్ఛ ఆటోల బాధ్యతను కాలనీవాసుల సహకారంతో డ్రైవర్లు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. తమ కాలనీకి స్వచ్ఛ ఆటోలను అందజేయడంలో చొరవ చూపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతయాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, నాయకుడు శ్రీనివాస్యాదవ్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.