బెంగళూరు: గురువారం విచారణకు తమ ముందు హాజరు కావాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్పై రిలీఫ్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు మంగళవారం నిరాకరించింది.
దీనిపై జస్టిస్ జీ నరేందర్ సారధ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ గత వారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మంగళవారం ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. అయితే, మంగళవారం విచారణలో గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆదేశాలిస్తామని పేర్కొంది.
ఘజియాబాద్లోని ఒక సీనియర్ సిటిజన్పై దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో అప్లోడ్ చేయడాన్ని సవాల్ చేస్తూ యూపీ పోలీసులు.. మనీశ్ మహేశ్వరిపై ఐపీసీలోని 41 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
దీనిపై మనీశ్ మహేశ్వరి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సదరు వీడియో అప్లోడ్తో తనకు సంబంధం లేదని, తన క్లయింట్ కేవలం ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియా ఉద్యోగి మాత్రమేనన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను అమెరికాలోని ట్విట్టర్ ఇంక్ నిర్వహిస్తున్నదని వాదించారు.