బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు తెరిచేందుకు అనుమతించింది.
రాష్ట్రంలో నిత్యం 10 వేలకుపైగా కరనోనా కేసులు నమోదవుతుండటంతో ఇటీవల 14 రోజులపాటు ప్రభుత్వం రాష్ట్రంలో కర్ప్యూ విధించింది.
ఇవాళ కర్ప్యూ నిబంధనలు సడలించడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోడ్లపై జనసందోహం కనిపించింది.
శనివారం వరకు కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 వేల కేసులు నమోదయ్యాయి.
రాజధాని బెంగళూర్లోనే19 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 124 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.