మనోజ్నందన్, నైనీషా, సాగర్, సరిత నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కథానిక’. జగదీష్ దుగన దర్శకుడు. పద్మ లెంక నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించాం. కథానిక రహస్యమేమిటన్నది ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు తెలుగు తెరపై రాని సరికొత్త ఇతివృత్తమిది’ అన్నారు. కరోనా ఉధృతి మధ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేశామని నిర్మాత చెప్పారు. తనకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమిదని నైనీషా చెప్పింది.