నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి
కౌడిపల్లి మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
కొల్చారం, ఏప్రిల్ 20: రైతులను రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొంగోడు, పోతిరెడ్డిపల్లి, అంసాన్పల్లి, వసురాంతండా, వెంకటాపూర్, పోతంశెట్పల్లి, అప్పాజిపల్లి, కొల్చారం, వరిగుంతం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మంగళవారం జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంపీవో కృష్ణవేణి, సర్పంచ్లు కరెంటు ఉమారాజాగౌడ్, నాగరాణి, మోతి, మన్నె శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు ఉదయ వేమారెడ్డి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, అరుణ పాల్గొన్నారు.
రాయిలాపూర్ లో …
కౌడిపల్లి,ఏప్రిల్20: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయిలాపూర్, తునికి, వెంకటాపూర్ గ్రామాల్లో మహ్మద్నగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గోవర్దన్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, ఎంపీపీ రాజునాయక్, డైరెక్టర్ నర్సింహులు, సర్పంచ్లు పాల్గొన్నారు.
కౌడిపల్లి మండల కేంద్రం లో ఎమ్మెల్యే మదన్రెడ్డి 96 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవితఅమర్సింగ్, ఎంపీడీవో భారతి, డిఫ్యూటీ తహసీల్దార్ శారద, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కాలేరు శివాంజనేయులు, మహ్మద్నగర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
ఖాజీపేట్ లో…
నర్సాపూర్,ఏప్రిల్20: మండల పరిధిలోని ఖాజీపేట్ గ్రామంలో ఐకేపీ, రుస్తుంపేట్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్ హేమలతమదన్మోహన్, ఉపసర్పంచ్ జ్యోతివెంకటేశ్, వార్డు మెంబర్లు, డైరెక్టర్లు, ఐకేపీ సిబ్బంది , రైతులు పాల్గొన్నారు.
గుండ్రెడ్డిపల్లిలో….
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 20: రైతులకు పెట్టుబడి సాయ ంతో పాటు రైతుబీమాతో ఆర్థిక సాయం చేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్కే దక్కుతుందని తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, సర్పంచ్ శ్రీలత రాజిరెడ్డితో కలిసి మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖాధికారి నుస్రత్, ఐకేపీ ఏపీఎం రామకృష్ణ,మహిళా సంఘం సభ్యులు , రైతులు పాల్గొన్నారు.