హైదరాబాద్ : సంగారెడ్డి పటాన్చెర్వు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ కంటైనర్ ట్యాంకర్ను తప్పించబోయి అదుపు తప్పి గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కంటైనర్ ఓ నాలుగేళ్ల బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతుడిని కంగ్టి మండలం తడ్కల్కు చెందిన శాంతికుమార్గా గుర్తించారు. గుఢ్ఫ్రైడే సందర్భంగా తల్లితో కలిసి చర్చికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండుగ రోజే తల్లి కండ్ల ఎదుటే కొడుకు మృత్యువాతపడడంతో విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.