లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్ఫూర్లో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేసేందుకు స్థానిక వ్యాపారులు ముందుకు వచ్చారు. తల్లిదండ్రులను లేదా కుటుంబానికి ఆధారమైనవారిని కరోనా వల్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను గుర్తించి సహాయం అందిస్తున్నట్లు వ్యాపారి జ్ఞానేష్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు 8 కుటుంబాలను గుర్తించామని, వారికి మూడు నెలల రేషన్, రూ.11,000 నగదు ఇచ్చినట్లు చెప్పారు. కాగా, తన ఫ్లాట్లో నివాసం ఉంటున్న ఇద్దరు బాలికల తల్లిదండ్రులు కరోనాతో చనిపోయారని పీకే పాండే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై వారి నుంచి అద్దె తీసుకోకూడదని నిర్ణయించానని, వారు ఎంత కాలమైనా తనకు చెందిన ఇంట్లో ఉండవచ్చని అన్నారు.