న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్యకుమార్ మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అలాగే గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అనంతరం కన్హయ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ బాలీవుడ్ నటుడు గోవిందలా తరచూ దుస్తులు మారుస్తుంటారని చురక వేశారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్హయ్య బీహార్లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్పై పోటీచేసి ఓడిపోయారు.