న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ప్రభావం వివిధ పారిశ్రామిక రంగాలపై తీవ్రంగానే పడింది. రోజువారీ నిత్యావసర వస్తువులను తయారు చేసే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. అతిపెద్ద రిటైల్ చైన్ నెట్వర్క్, ఈ-కామర్స్ దిగ్గజాలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆర్డర్లు తగ్గాయి. కొవిడ్-19 ఇన్ఫెక్షన్తో సిబ్బంది అస్వస్థతకు గురి కావడం, కరోనా ఆంక్షలతో పరిమిత కాలంగా స్టోర్ల నిర్వహణ వంటి అంశాలు డిమాండ్ పడిపోవడానికి కారణాలని తెలుస్తున్నది.
రాష్ట్రాల వారీగా స్పెసిఫిక్ లాక్డౌన్ అమలు చేయడం వల్ల డిమాండ్ పడిపోయిందని దేశంలోని వివిధ సూపర్ మార్కెట్లు చెప్పాయి. భారీగా నిల్వలు పేరుకుపోవడంతో ఈ-కామర్స్ సంస్థల నుంచి ఆర్డర్లు తగ్గాయి. పలువురు ఉద్యోగులు కొవిడ్-19 భారీన పడటం కూడా నిల్వలు పెరిగిపోవడానికి మరో కారణం అని ఎఫ్ఎంసీజీ సంస్థల ప్రతినిధులు అంటున్నారు.
భవిష్యత్ మీద ఆశలతో గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ-కామర్స్ సంస్థలు, రిటైల్ షాపులు భారీగా ఆర్డర్లు పెట్టేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
దేశంలోనే అతిపెద్ద బిస్కట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ తమ క్లయింట్ల కోసం పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేసింది. మోడర్న్ రిటైల్ సంస్థలు, ఈ-కామర్స్ సంస్థల కోసం 35-40 శాతం ఉత్పత్తి తగ్గించి వేసింది. పార్లె ప్రొడక్ట్స్ సీనియర్ క్యాటగిరీ హెడ్ క్రుష్ణారావు బుద్ధ మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే 50-60 శాతం ఆర్డర్లు పెరిగాయి..
హెల్త్, పరిశుభ్రత క్యాటగిరీలు మినహా వివిధ ఉత్పత్తుల వినియోగం పట్ల డిమాండ్ తీవ్రంగా పడిపోయిందని ఇమామీ డైరెక్టర్ హర్ష వీ అగర్వాల్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తులను సర్దుబాటు చేస్తున్నాం అని తెలిపారు.
లాక్డౌన్ల అమలు, సప్లయి చైన్లో అవరోధాల ప్రభావం వేసవి ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ బిజినెస్ తీవ్రంగా పడిపోయింది.
హోటళ్లకు విక్రయించే అమూల్ ఐస్క్రీమ్స్, డెయిరీ ప్రొడక్ట్స్ విక్రయాలు తగ్గిపోవడంతో వాటి ఉత్పత్తిని 50 శాతం తగ్గించామని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్ఎల్) తెలిపింది. శీతల పానీయాల ఉత్పత్తి 20-25 శాతం పడిపోయింది.
హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయడంతో డెయిరీ ఉత్పత్తుల కొనుగోళ్లు 4-5 శాతం తగ్గాయని జీసీఎంఎంఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధీ వెల్లడించారు. మొత్తం బిజినెస్లో ఇది 10 శాతం అని తెలిపారు.
మహారాష్ట్రతోపాటు కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి నిత్యావసర దుకాణాలను నాలుగైదు గంటలకే పరిమితం చేశాయి.
డీమార్ట్ చైన్ అనుబంధ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ యాజమాన్యం.. నిల్వలు కనీస స్థాయికి తీసుకొచ్చింది. కేవలం నాలుగు గంటలు మాత్రమే బిజినెస్ చేయడానికి అనుమతించడంతో విండో ఆపరేషన్ సేల్స్ పరిమితం అయ్యాయని ఎవెన్యూ సూపర్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నెవెల్లీ నొరోణా చెప్పారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?
వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్లు : ఎస్బీఐ
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు డిజిటల్ సేవలకు దూరం ఎందుకంటే..!
జంట సవాళ్లు.. బెంగాల్లో 16 జూట్ మిల్లుల మూసివేత!
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్
పెళ్లికొచ్చిన అతిథులతో కప్ప గంతులు.. వీడియో వైరల్