గద్వాల, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రా మానికి చెందిన నర్సమ్మ చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.24వేల చెక్కు ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కృష్ణమోహన్రె డ్డి అందజేశారు. అలాగే మల్దకల్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిన్న నరసింహులు గతేడాది డిసెంబర్ 30న ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. అయితే దేవాదాయ శాఖ తరఫున మృతుడి భార్య శివమ్మకు దేవాదాయశాఖ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.4లక్షల నగదు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం నర్సింహులు భార్య శివమ్మకు మల్దకల్ దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పించగా ఉద్యోగ ఆర్డర్ కాపీని అందజేశారు. కార్యక్రమంలో ఆల య వ్యవస్థాపక వంశీయులు ప్రహ్లాదరావు, కార్యనిర్వాహణాధికారి సత్యచంద్రారెడ్డి, ఎంపీపీ రాజారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, నాయకులు మధుసూదన్రెడ్డి, నరేందర్, వెంకటన్న, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ విష్ణు పాల్గొన్నారు.